హైదరాబాద్ : ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకొని శనివారం తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) హరీ రామ్, అనిత (Dy ENC) దంపతులు హైదరాబాద్లోని తమ నివాసంలో మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిందిగా ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.