హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలోని సెమినార్ హాల్లో చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ పలితాలను విడుదల చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ ఎడ్సెట్ – 2021 పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 42,399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తమ్మీద హాజరుశాతం 80.5 శాతంగా నమోదైంది.