హైదరాబాద్ : టీఎస్ ఈసెట్-2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించినట్లు కన్వీనర్ సీహెచ్ వెంకట రమణ రెడ్డి ప్రకటన చేశారు. వచ్చే నెల 26వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. జులై 31వ తేదీ వరకు రూ. 5 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 3వ తేదీన ఈసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తుండటంతో మరోసారి దరఖాస్తులకు వెసులుబాటు కల్పించారు.