హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ -2021 దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 24వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈసెట్ కన్వీనర్ సీహెచ్ వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వెసులుబాటును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.
ఈసెట్ పరీక్షలను జులై 1వ తేదీన నిర్వహించనున్నారు. ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, ఈఈఈ స్ట్రీమ్లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అదే సీఐవీ, సీహెచ్ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్ఎం, బీఎస్ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరగనుంది.