హైదరాబాద్ : తెలంగాణ ఈసెట్-2021 ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి రేపు ఉదయం 11 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో విడుదల చేయనున్నారు. అధికారి వెబ్సైట్ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈనె 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష రెండు సెషన్లల్లో జరిగింది.