హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2021 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు విజ్ఞప్తి మేరకు ఎంసెట్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు.
ఎంసెట్ పరీక్షలు జూలై 5 – 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్లో జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, మరో సెషన్ను అవసరాన్ని బట్టి నిర్వహించాలనుకుంటున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.