హైదరాబాద్: బ్రాహ్మణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం (వీఓఈఎస్) దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పొడిగించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రవీకరణ పత్రాలు, విదేశీ వర్సిటీల నుంచి ఐ20 లెటర్లు తీసుకోవడంలో విద్యార్థులకు ఆలస్యమవుతుండటం, ఇంకా అప్లయ్ చేయని విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును జూన్ 18 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ల గడువు మే 28తో ముగియనుంది.
వెబ్సైట్: www.brahminaparishad.telangana.gov.in