హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా హోంశాఖపై చర్చించారు. కొత్త జిల్లాల్లోని పోలీసు స్టేషన్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. హోంమంత్రి మహముద్ అలీ నేతృత్వంలో ఏర్పాటైన ఉపసంఘంలో సభ్యులుగా హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కొనసాగనున్నారు. కొత్త జిల్లాల్లోని పోలీసు స్టేషన్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి నివేదికను రూపొందించనుంది.