హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా ఏడు గంటల పాటు కొనసాగింది. సమావేశంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలు, రుణ మాఫీ, పింఛన్లు, కేంద్ర కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వయో పరిమితి సడలింపు, నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, అనాథ చిన్నారుల స్థితిగతులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు వంటి తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంది.