హైదరాబాద్ : శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యే రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో గురువారం శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలు, సీఎం కేసీఆర్, మంత్రులు, సభ్యులు వెళ్లేందుకు వేర్వేరు ప్రవేశ ద్వారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. మరో వైపు ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లులు వాటిపై చర్చ..సభ్యులు అడిగే ప్రశ్నలపై ప్రభుత్వ పక్షాన మంత్రులు సమాధానాలు ఇస్తారు.
అయితే ఈ క్రమంలో ప్రతి సభ్యుడికి ఇటు అసెంబ్లీ, శాసన మండలిలో అవకాశం ఇస్తామని సభ్యులు తమ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ పోచారం పేర్కొన్నారు. మరో వైపు పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సన్నాహక సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పెగాసిస్ వ్యవహారంపై విచారణకు టెక్నికల్ కమిటీ: సుప్రీంకోర్టు
Air Pollution | ప్రతి ఏటా 70 లక్షల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: డబ్ల్యూహెచ్వో