మంత్రి కొప్పులకు సంఘం ప్రతినిధుల వినతి
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దూదేకుల కార్పొరేషన్ను ఏర్పాటుచేయాలని ఆ వృత్తి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసినవారిలో తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్భాష్, దుదేకుల వృత్తి సంక్షేమ సంఘం త్రినిధులు మహమ్మద్ సుబాన్ అలీ, మహమ్మద్ రషీద్, మహమ్మద్ జహంగీర్, అబ్దుల్ రజాక్, అబ్దుల్ రహీం ఉన్నారు.