హైదరాబాద్ : సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియర్ దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులు పాల్గొననున్నారు. ఈ పథకంలో భాగంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న దాదాపు 8 లక్షల దళిత కుటుంబాలను దశలవారీగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందుకుగాను రూ. 1,000 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు.