ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు
హుజూరాబాద్టౌన్, జూన్ 30: ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను గడగడపకూ చేర్చాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ హుజూరాబాద్ బాధ్యులకు సూచించారు. రానున్న ఉపఎన్నికల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటేసేలా అవగాహన కల్పించాలని కోరారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని రంగనాయక సాగర్ గెస్ట్హౌస్లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి సంఘం బాధ్యులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిన కేంద్రం తీరును ఎండగట్టాలన్నా రు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ప్రతినిధులు రఘుపతి, రాజు, మల్లేశం, రజనీకాంత్, శ్రీనివాస్, శివాజీ, హరికృష్ణ, కోటేశ్వర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు