హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): బడుగుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఈటలకు బడు గు, బలహీనవర్గాల గురించి, కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. శనివారం వారు తెలంగాణభవన్లో మాట్లాడుతూ.. మతోన్మాద పార్టీలో ఆత్మగౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల పాకులాడుతున్నారని మండిపడ్డారు. సంఘాలకు నాయకులను కార్మికులే ఎన్నుకుంటారని, ఒత్తిడికి గురిచేసి ఎన్నుకోరని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో కార్మికుల హక్కులకు రక్షణ పెరిగిందని అన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కార్మికలోకం ఊరుకోదని హెచ్చరించారు.