రంజాన్ పండుగను ఇండ్లలోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలో ముస్లింలు పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఇండ్లకే పరిమితమయ్యారు. నమాజ్కు ఐదుగురికి మించి వెళ్లకూడదన్న ఆదేశాలతో ఐదుమంది చొప్పున మసీద్లు, దర్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర భావాలను ఎదనిండ నింపు కొని వేడుకోలు (దువా), ఇతరులు తథాస్తు(అమీన్) అంటూ వాట్సాప్లో శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలుపుకున్నారు. యావత్ ప్రపంచానికి కొవిడ్ పీడ పోయి జనజీవనం ప్రశాంతంగా కొన సాగాలని ఆయా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపినట్లు ఇమామ్లు పేర్కొన్నారు. అల్లా దయతో కొవిడ్ భయబ్రాంతుల నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మైనార్టీ సోదరులు తెలిపారు. వివిధ పార్టీల నాయకులు, అధికారులు మైనార్టీ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.