నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి
డీవైఎస్వో కే రాజవీరు
నగరంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కొత్తపల్లి, జూన్ 22 : యోగా సాధనతో రోగాలు దూరమవుతాయని జిల్లా యువజన, క్రీడాశాఖాధికారి కే రాజవీరు అన్నారు. అంతర్జాతీయ యో గా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మంకమ్మతోటలోని సాయి మానేరు స్కూల్లో జి ల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. మాజీ మేయర్, జిల్లా యోగా సంఘం అధ్యక్షుడు సర్ధార్ రవీందర్సింగ్ మాట్లాడుతూ మనదేశానికి చెందిన యో గాను ఇతర దేశాలు అనుసరించడం గర్వకార ణ మన్నారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, తెలంగాణ రాష్ట్ర జూడో సంఘం ప్ర ధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దరెడ్డి, జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి సిద్దారెడ్డి మాట్లాడు తూ యోగాను పాఠ్యాంశంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి స్వదేశ్కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు బుర్ర మధుసూదన్రెడ్డి, వాలీబాల్, బేస్బాల్ సంఘాల కార్యదర్శులు గిన్నె లక్ష్మణ్, ఎండీ యూనిస్ పాషా, యోగా సంఘం బాధ్యు లు, కోచ్లు ఎస్ సంపత్కుమార్, కిష్టయ్య, మల్లి క, ఉదయ్కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాచార్యులు సంపత్కుమార్ క్రీడాకారులతో ఆసనాలు వేయించారు.
సర్వరోగ నివారిణి..
యోగా సర్వరోగ నివారణి అని అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ అన్నారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వాగేశ్వరీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హా జరై మాట్లాడారు. వయస్సుతో నిమి త్తం లేకుండా అందరూ యోగా సాధ న చేయాలన్నారు. పతంజలి యోగా జిల్లా అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ప్రధాని కృషితో ప్రపంచ గుర్తింపు..
ప్రధాని నరేంద్ర మోడీ కృషితోనే యో గాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని మైనార్టీ మోర్చా రా ష్ట్ర కార్యదర్శి మహ్మద్ జమాల్ అన్నారు. సోమవారం స్థానిక సుమంగళి గార్డెన్స్లో నగర సెంట్ర జోన్ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సాయికృష్ణ, దేవిశెట్టి నవీన్కుమార్, బొడ్ల శ్రీరాములు,, కలికోట మోహన్, బూర్ల లక్ష్మీనారాయణ, రాంచంద్రారెడ్డి, సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్నేహబంధం ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా గురువు అంజిబాబు ఆధ్వర్యంలో యోగాసనాలు చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్, వా సాల రమేశ్, స్వర్గం నర్సయ్య పాల్గొన్నారు.