హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించడంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై చర్చించనున్నారు. పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పురోగతి, ఇతర అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. అదేవిధంగా హుజూరాబాద్ ఉపఎన్నికపై కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నది.