భోపాల్: బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో అనుచరులు ఆమెను హుటాహుటిన విమానంలో ముంబైకి తరలించారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. భోపాల్లోని ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ కార్యాలయం అధికారులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా, ప్రగ్యాసింగ్ ఠాకూర్ గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.