అమరావతి : అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్కు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను హైదరాబాద్, నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.
కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషన్పై ఈ నెల 7న సైతం విచారణ జరగ్గా కౌంటర్ దాఖలుకు కోర్టును, సీబీఐ అధికారులను జగన్ సమయం కోరారు. దీంతో కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.