కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తారని, అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దన్నారు. హుజూరాబాద్ కొత్త జిల్లా అవుతుందని, భీమదేవరపల్లి మండలం నుంచి వంగర, కొత్తకొండ మండలాలు అవుతాయని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు.
పీవీ ప్రాథమిక విద్యాభ్యాసం ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా వేలేరులోనే కొనసాగిందని, వరంగల్ జిల్లాతో ఆయనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు. అందుకే వరంగల్ అర్బన్ జిల్లాకే పీవీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు చెప్పారు. పీవీ శతజయంతిలోగా ఆయన స్వగ్రామం వంగరలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే తలంపుతో ప్రభుత్వం నిధులు సైతం కేటాయించిందని తెలిపారు.
కరోనా ప్రభావంతో పనుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, ఎంపీపీ జక్కుల అనితారమేశ్, జడ్పీటీసీ వంగ రవి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్