హైదరాబాద్ : నగరంలోని జల్పల్లి మున్సిపాలిటీ 28వ వార్డు ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండనుంది. ఎంఐఎం విజ్ఞప్తితో ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. 28వ వార్డు కౌన్సిలర్ నజియా బేగం మరణించడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. నజియా బేగం కోడలు తైసీమ్ బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాల్సిందిగా కోరగా అందుకు టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది.
అంతకుక్రితం సైతం లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికకు కూడా దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్థానంలో ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ అనారోగ్యంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.