వరంగల్: వార్ వన్ సైడ్ అన్నట్టు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్ఎస్ పక్షానే ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా.. వరంగల్ ప్రజలు మంచి తీర్పు ఇస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించారని గుర్తుచేశారు. శనివారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వరంగల్లో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ హామీలకే పరిమితమని.. ఇప్పటివరకు ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. కరీంనగర్లోనే ఏమీ చేయని బండి సంజయ్.. వరంగల్లో చేస్తానంటే నమ్మాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ మాటలు నమ్మేందుకు జనాలు సిద్ధంగా లేరన్నారు. ప్రతి ఎన్నికలో ప్రజలు ఓడిస్తున్నా బండి సంజయ్కు బుద్ధిరావడం లేదని విమర్శించారు. వరంగల్ రూపు రేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. బీజేపీ నేతలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేందేంటి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి