ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కరోనా వణికిస్తోంది. ఏం చేస్తే వైరస్ బారిన పడకుండా ఉంటాం? ఓ వేళ సోకితే ఎలాంటి చిట్కాలు పాటించి దూరం చేసుకోవాలి? అల్లోపతి సరే ఆయుర్వేదంలో మందులున్నాయా? ఇలా అనేక మందిలో ఉన్న సందేహాలకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ సమాధానాలు ఇచ్చారు. మహమ్మారిని ఎదుర్కోవాలంటే మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి తగినంతగా ఉండాలని. దాన్నీ పెంచుకునేందుకు పలు రకాల ఔషధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంటి చిట్కాలు కూడా ఎంతో మేలు చేస్తాయని, కషాయాలు అధికంగా సేవించడంతో ఇతర సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. ఎవరికి తోచింది.. వారు చేయకుండా సరైన అవగాహనతోనే ఆయుర్వేద చిట్కాలు పాటించాలని ‘నమస్తే తెలంగాణ‘కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
తప్పేమీ లేదు. కరోనా తీవ్రతను బట్టి అల్లోపతితో పాటు ఆయుర్వేదం వాడొచ్చు.
వైరస్ ప్రభావం తక్కువ ఉన్నప్పుడు ఆయుర్వేద మందులు మంచి ఫలితాలు ఇస్తాయి.
ఆయుర్వేద మూలికలతో విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
కరోనా ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేస్తుంది. పసుపును తీసుకుంటే కురుకుయన్ అనే రసాయనం తిరిగి ఊపిరితిత్తుల కణజాలాన్ని మృదువుగా మారుస్తుంది. అడ్డసారం(వాసా) శ్వాస ఇబ్బందులను తగ్గిస్తుంది. దగ్గును పోగొడుతుంది. కరోనాకు ఇది మంచి ఔషధం. అంతేకాక తులసి, మిరియాలు గొంతు గరగరను తగ్గిస్తాయి.
జీవన విధానం మార్చుకోవాలి. తగిన శారీరక శ్రమ చేయాలి. వేడి వేడి ఆహారం తినాలి. రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు నడవాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. మాంసహారాన్ని మితంగా తినాలి. తిన్న తర్వాత వెంటనే నిద్ర పోరాదు. కనీసం రెండు గంటల వ్యవధి ఇవ్వాలి.