హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, ఇందుకు తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేతలను దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు, తదితరులు హాజరయ్యారు.