కరీంనగర్ : హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల్లో టీఆర్ఎస్ 90 శాతం మెజార్టీ ఓట్లు వచ్చే విధంగా కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ మండల రూరల్ గ్రామాల ఇంచార్జి వొడితెల సతీష్ కుమార్ అన్నారు. శనివారం హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో టీఆర్ఎస్ మండల బాధ్యుల సమావేశం జరిగింది. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండలాలకు చెందిన పలువురిని గ్రామాల్లో ఇంచార్జీలుగా నియమించారు.
ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు, యువతకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉందని దాని వల్ల తెలంగాణలోని ఏ ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. ఈటల రాజేందర్ ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరారు. అతడివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు.
కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎం. సుధీర్ కుమార్, జడ్పీటీసీ పడిదం బక్కరెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, ఎడవెల్లి కొండల్ రెడ్డి, సరబుడ్ల ప్రభాకర్ రెడ్డి, బిల్ల వెంకట్ రెడ్డి, శ్రీపతి రవీందర్ గౌడ్, పొలం పల్లి శ్రీనివాస్ రెడ్డి, నగేష్, సురేందర్ రెడ్డి, తొగరు భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా