అంబర్పేట, మే 17 : పాదయాత్రలతో స్థానిక సమస్యలకు మోక్షం కల్పిస్తున్నమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం తిలక్నగర్లో ఆయన పలు శాఖల అధికారులతో కలిసి పాద యాత్ర చేశారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వరద నీటి నాలాతో పాటు డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కొత్త సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారిస్తామని ఆయన బస్తీవాసులకు హామీ ఇచ్చారు. కొత్త సీసీ రోడ్డు ఏర్పాటు కోసం అంచనా వేసి నివేదికను అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పలుశాఖల అధికారులతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్పేట, మే 17 : అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. సోమవారం జలమండలి అధికారులతో కలిసి అంబర్పేట ఛే నంబరులోని నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పైపులైన్ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి జీఎం మహేశ్, డీజీఎం సన్యాసిరావు, సతీష్, రోహిత్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈలు కుశాల్, సౌమ్య, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గోల్నాక, మే 17 : నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం గోల్నాక డివిజన్ తులసీరాంనగర్ లంకలో ఆయన అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ పైపులైన్ల ఏర్పాటు అనంతరం రహదారి వేయకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని, బస్తీలో అసంపూర్తిగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన బస్తీవాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలుశాఖల అధికారులు సతీశ్, రోహిత్, మజీద్, అశ్వాక్, మనోహర్తో పాటు బస్తీవాసులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.