తొగుట/మిరుదొడ్డి /మద్దూరు, ఏప్రిల్ 6: ఎప్పటిమాదిరిగానే రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నర్సాయపల్లిలో గ్రామ సర్పంచ్ బద్దిపడిగె లలితాకృష్ణారెడ్డి అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులు అపోహలకు లోనుకావద్దన్నారు. అనంతరం తలారి ప్రవీణ్కుమార్కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 60వేల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును బాధితుడికి ఎంపీపీ అందజేశారు. సమావేశంలో తహసీల్దార్ నరేందర్, ఏఈవో రాకేశ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిరుదొడ్డిలో..
మిరుదొడ్డి యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మిరుదొడ్డి మండల ప్రత్యేకాధికారి ఈఎస్ గణేశ్ రామ్ అన్నారు. మంగళవారం మిరుదొడ్డి వ్యవసాయ కార్యాలయంలో ఐకేపీ, వ్యవసాయ శాఖల అధికారులతో కలిసి వడ్ల కొనుగోలు సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ పై ప్రత్యేక సమావేశంలో నిర్వహించారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో 20 వడ్ల కొనుగోలు సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో ఏవో బోనాల మల్లేశం, ఐకేపీ ఏపీఎం నాయిని కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల ఏఈవోలు పాల్గొన్నారు.
కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాం
యాసంగిలో వరి కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మండల వ్యవసాయాధికారి మోహన్ తెలిపారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి, ఎల్ బంజేరుపల్లిలో కొనుగోళ్లపై రైతులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల సత్యనారాయణ, ఉప సర్పంచ్ సురేశ్ గౌడ్, ఏఈవో నవీన్ కుమార్, రైతులు మల్లారెడ్డి, పులీందర్రెడ్డి, ఎల్లారెడ్డి, బాల్రెడ్డి, విక్రమ్చారి, యాదగిరి, నర్సింహులు, ఐకేపీ నిర్వాహకులు రవి, లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.