శంకర్పల్లి, మార్చి 29: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఉల్లి సీజన్ ప్రారంభమయ్యింది. మార్చి మొదటి వారం నుంచి మార్కెట్కు రైతులు ఉల్లిని వేలంపాటకు తెస్తున్నారు. కాగా ఉల్లి ధర ఒకే సారి భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో ఉల్లి క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1150వరకు ధర పలుకుతుంది. గత సంవత్సరం ఇదే సీజన్లో రూ.1500 ధర పలికింది. కంది, కొండాపూర్ మండలాల గ్రామాలైన ఎద్దుమైలారం, జూలకంటి, గుంతపల్లి రైతు లు పండించిన ఉల్లిని మార్కెట్కు తరలిస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఉల్లి ధర క్వింటాలుకు ఏకంగా రూ. నాలుగు వేలు పలికింది. ఫిబ్రవరి వరకు ఇవే ధరలు ఉండడం తో రిటైల్గా కేజీ ఉల్లి రూ.60 కు విక్రయించారు. ప్రస్తుతం రిటైల్ ధర రూ.100కు 6 నుంచి 5 కేజీల వరకు విక్రయిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాల నుంచి ఉల్లి హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్కు అధిక మొత్తంలో దిగుమతి కావడం వల్ల శంకర్పల్లిలో కూడా ఉల్లి ధరల తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుత ధరలు ఇలాగే ఉంటే తాము పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు. ఒకప్పుడు ఉల్లి సాగుకు శంకర్పల్లి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండేది. ప్రస్తుతం అతివృష్టి, అనావృష్టివల్ల ఉల్లిని పండించడం లేదు. ఒకటి రెండు గ్రా మాల్లో మాత్రమే రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు.
ధరలు తగ్గితే పెట్టుబడి కూడా రాదు
ప్రస్తుతం శంకర్పల్లి మార్కెట్లో ఉల్లి ధరలు గణనీయంగా దిగి పో యాయి. దీంతో రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఎంతో నష్టపోవలసి వస్తుంది. అతివృష్టి, అనావృష్టి వల్ల మండలంలోని రైతులు ఉల్లిని సాగు చేయలేకపోతున్నారు. సం గారెడ్డి జిల్లాల గ్రామాల రైతులు ప్రస్తుతం పండించిన ఉల్లి ని మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఉల్లికి మద్ద తు ధర క్వింటాలుకు రూ.1500 ప్రకటిస్తేనే గిట్టుబాటు అవుతది. -నర్సింహాగౌడ్ రైతు, అంతప్పగూడ ,శంకర్పల్లి