సులువైన బోధనతో ఉత్తమ ఫలితాలు
విజయాలకు చిరునామాగా బెల్లంపల్లి సీవోఈ
బెల్లంపల్లి రూరల్, మార్చి 29 : ఇటీవల వెలువడిన జాతీయస్థాయి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ( సీవోఈ)కి చెందిన పేదింటి బిడ్డలు తమదైన సత్తా చాటారు. ఈ ఏడాది కళాశాల నుంచి 33 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 17 మంది అత్యధిక పర్సంటైల్ సాధించి ఆదిలాబాద్ రీజియన్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఏటా ఎంసెట్తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్, ఐఐటీ, ఐసర్, నైసర్, హోటల్ మేనేజ్మెంట్, సీయూసెట్ లాంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణనిచ్చి మట్టిలో నుంచి మాణిక్యాలను వెలికితీస్తున్నది బెల్లంపల్లి సీవోఈ. ఇక్కడి విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు తీసుకొస్తున్నది. కళాశాలలో ప్రత్యేక ప్రణాళిక, నాణ్యమైన బోధనతో అత్యంత మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేదింటి బిడ్డలు పోటీ పరీక్షల్లో కార్పొరేట్కు దీటుగా అద్భుతాలు సాధిస్తున్నారు.
పరీక్ష ఏదైనా ర్యాంకుల పంట పండిస్తున్నారు. అరుదైన రికార్డులు నెలకొల్పుతూ సీవోఈని విజయాలకు చిరునామాగా నిలుపుతున్నారు. 2014-15 విద్యా సంవత్సరం ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో ఏర్పడిన బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఎంతో మంది గ్రామీణ పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్ను అందిస్తున్నది. గత సంవత్సరం కళాశాల నుంచి 11 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో సత్తాచాటి అడ్వాన్స్డ్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో నైతం రాజేశ్ ఐఐటీ వారణాసి, చునార్కర్ ప్రవీణ్ నీట్ తిరుచ్చిలో సీట్లు సాధించి గ్రామీణ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులకు జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అధ్యాపకులతో ప్రత్యేక తర్ఫీదు అందించడంతో 17 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు మూసివేయడంతో ఆన్లైన్ తరగతుల ద్వారా ఎంపికైన ఈ విద్యార్థులకు అధ్యాపకుల ద్వారా ప్రత్యేకమైన శిక్షణ అందిస్తున్నారు.
ఉత్తమ బోధనే నా విజయానికి తోడ్పడింది..
కళాశాలలో అధ్యాప కులు అందిస్తు న్న ఉత్తమ బోధ నే నా విజయా నికి తోడ్పడింది. జాతీయ స్థాయి లో జరిగే జేఈ ఈ మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రత్యేక ప్రణాళిక చాలా అవసరం. కళాశాలలో మాకు సబ్జెక్టు లపై సంపూర్ణమైన అవగాహన కల్పిస్తూ పరీక్షలకు ముందస్తుగా ప్రిపేర్ చేయిం చారు. దానివల్లే నేను జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో 92.06 పర్సంటైల్ సాధించి కళాశాల టాపర్గా నిలిచా. అడ్వాన్స్డ్ పరీక్షల్లోనూ మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్న.