మీరట్ : అంతర్జాతీయ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్పాల్ సింగ్ గురువారం మరణించారు. అతడు చాలా రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. 63 ఏండ్ల కిరణ్పాల్ మీరట్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. బులంద్షహర్లో నివసించిన కిరణ్పాల్ చాలా కాలం పాటు యూపీ పోలీసు ఉద్యోగం చేసి.. కొన్నేండ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకున్నాడు.
కిరణ్పాల్ సింగ్ గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. కొన్ని రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్, నోయిడాలోని దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఇంగ్లండ్లోని వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగింది. అతడికి కీమో థెరపీ ఢిల్లీ, నోయిడాలో చేశారు. కానీ, రెండు వారాల క్రితం అతడి పరిస్థితి మళ్లీ క్షీణించింది. దాంతో అతడిని గంగానగర్లోని సమీప దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో ముజఫర్ నగర్ ప్రాంతంలోని ముస్సూరీ దవాఖానలో చేర్చి చికిత్స అందించాఉ. కాలేయ వ్యాధి కారణంగా కామెర్లు, అనేక ఇతర వ్యాధుల బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. చివరకు గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుతం భువి ఇంటి వద్దనే ఉండి తండ్రిని చూసుకుంటున్నాడు.
ఎన్నికల్లో అధిక ఖర్చుపై ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడిపై విచారణ
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..