న్యూఢిల్లీ: జువెనైల్ జస్టిస్ సవరణ బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. బాల నేరస్థులకు రక్షణ కల్పించాలన్నారు. జువెనైల్ కేసులు పెద్ద కోర్టులకు వెళ్లకుండా ఉండేందుకు.. జిల్లా మెజిస్ట్రేట్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు. పిల్లలు ఎటువంటి వేధింపులకు గురికాకుండా చూడాలన్నారు. ఏ దశలోనూ చిన్నారులపై వివక్ష ఉండవద్దన్నారు. ప్రత్యేక హోమ్లను నిర్వహిస్తున్న తీరు సరిగా లేదని, వాటిని మెరుగుపర్చాలన్నారు. జువెనైల్ చట్టం ప్రకారం చిన్నారులను కాపాడుకోవాలన్నారు. బాలల ప్రాథమిక హక్కులను రక్షించే రీతిలో బిల్లులో సవరణలు పొందుపరచాలన్నారు. చిన్నారులు చేస్తున్న నేరాలపై జువెనైల్ బోర్డు అధ్యయనం చేయాలన్నారు.