యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. ఆదివారం యాదగిరిగుట్ట వెళ్లిన మేయర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మేయర్ విజయలక్ష్మికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆమెకి వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.