న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు ముంబై టీమ్ కెప్టెన్ పృథ్వీ షా. కర్ణాటకతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో కేవలం 122 బంతుల్లో 167 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో పృథ్వీ 150కిపైగా స్కోర్లు చేయడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. ఇంతకుముందు రెండు మ్యాచ్లలో అతడు వరుసగా 227, 185 పరుగులు చేశాడు. నెమ్మదిగా ప్రారంభించిన పృథ్వీ తర్వాత వేగం పెంచాడు. 79 బంతుల్లోనే టోర్నీలో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో దారుణమైన ప్రదర్శనతో టీమ్లో చోటు పోగొట్టున్న షా.. డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే టోర్నీలో 725 పరుగులు చేసిన పృథ్వీ.. 723 పరుగులతో మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును బద్ధలుకొట్టాడు.