హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. తండ్రి నోముల నరసింహాయ్య మెజార్టీని కుమారుడు నోముల భగత్ అధిగమించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింహయ్య కేవలం 7,771 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలుపొందారు. నాటి ఎన్నికల్లో నర్సింహయ్యకు 83 వేల ఓట్లు రాగా, తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్కు 87 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 75 వేల ఓట్లు పోలవ్వగా, ఇప్పుడు 68 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో జానారెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. తండ్రి కంటే భారీ మెజార్టీ సాధించిన భగత్కు పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..