న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారట్ బంగారం రూ.46 వేల దిగువకు దిగి వచ్చింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ.264 పెరిగి రూ.45,783కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ బంగారం ధర రూ.46,047 వద్ద ముగిసింది. అంతర్జాతీయ స్థాయిలో విలువైన లోహాల ధరలు తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధర రూ.60 తగ్గి రూ.67,472కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,532 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,755 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.80 అమెరికన్ డాలర్లు పలికింది.