నల్లగొండ రూరల్, జూలై 9 : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. పనులు జోరుగా సాగుతుండగా.. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాలను తీర్చిదిద్దుకుంటున్నారు. అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం పల్లె ప్రగతిలో భాగంగా 8వ రోజు నల్లగొండ మండలంలోని రాములబండ, దీపకుంట, రంగారెడ్డినగర్ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్తోపాటు, పీపీవీ, నర్సరీలను ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి పరిశీలించి మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు. పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, ఏఆర్ఐ అమర్నాథ్రెడ్డి, సర్పంచులు మామిళ్ల సైదులు, రూపాని జయమ్మ, చింతపల్లి జయమ్మ, పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్, మౌనిక, మమత పాల్గొన్నారు.
దళితవాడల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎంపీపీ విజయలక్ష్మి
తిప్పర్తి : దళితవాడల్లో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇండ్లూరులో మండల ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావుతో కలిసి ఎస్సీ కాలనీలో పర్యటించారు. వైకుంఠధామాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. సర్పంచ్ మార్త శ్రీదేవీసైదులు, ఎంపీడీఓ మహేందర్రెడ్డి, ఎంపీఓ సంగీత, ఏఈ ఉస్మాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, సోమయ్య పాల్గొన్నారు.
సమస్త జీవరాశికి చెట్లే ఆధారం : రాజేశ్వరి
నీలగిరి : సమస్త జీవరాశి మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఒకటో వార్డు కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు కోరారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేసి పలు వీధుల్లో నాటారు. టీఆర్ఎస్ నాయకులు ఆలకుంట్ల మోహన్బాబు, ఓర్సు శ్రావణ్కుమార్, రూపని యాదగిరి, శిరస్సు నగేశ్, రాజు, ఓర్సు పరమేశ్, రూపని రవితేజ, మహేశ్, యాదగిరి పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడుదాం : బాలశౌరి
కట్టంగూర్ : విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మండల ప్రత్యేకాధికారి బాలశౌరి అన్నారు. కల్మెర గ్రామంలో జీవ వైవిధ్య కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, జడ్పీటీసీ బలరాములు, ఎంపీడీఓ సునీత, ఎంపీఓ పర్వేజ్, ఏపీఓ వెంకటేశం పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ప్రత్యేకాధికారి, జడ్పీటీసీ
శాలిగౌరారం : మండలంలోని బైరవునిబండ గ్రామంలో సర్పంచ్ దండ రేణుకాఅశోక్రెడ్డితో కలిసి మండల ప్రత్యేకాధికారి తిరుపతయ్య మొక్కలు నాటారు. ఎంపీడీఓ రేఖల లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి పరమేశ్ ఉన్నారు.చండూరు : మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో పల్లె ప్రగతిలో భాగంగా జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మొక్కలు నాటారు. తేరెట్పల్లిలో ఎంపీడీఓ బాలకృష్ణ పల్లె పకృతి వనాన్ని పరిశీలించారు. కస్తాలలో రోడ్ల వెంట మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో పీఆర్ఏఈ రమేశ్, సర్పంచులు కొండారెడ్డి వెంకట్రెడ్డి, ద్రౌపతమ్మ, ఎంపీటీసీ సత్తయ్య, కార్యదర్శి విఠల్రెడ్డి పాల్గొన్నారు.
వనరులను కాపాడుకోవాలి: ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్
మర్రిగూడ : ప్రకృతి వనరులను కాపాడి భావితరాలకు కానుకగా అందించాలని ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ముత్యాలమ్మ గుడి వద్ద జీవ వైవిధ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ నల్ల యాదయ్య, ఎంపీఓ ఝాన్సీరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి యూసుఫ్ పాల్గొన్నారు.
పిచ్చిమొక్కల తొలగింపు
మునుగోడు : మండలంలోని గూడపూర్, కొరటికల్, దుబ్బకాల్వ గ్రామాలను మండల ప్రత్యేకాధికారి హుస్సేన్బాబా సందర్శించారు. రోడ్ల వెంట పిచ్చి మొక్కలను డోజర్ ద్వారా తొలగింపజేశారు. అనంతరం మొక్కలు నాటి ఆయా పాలకవర్గాలకు పలు సూచనలు చేశారు. ట్రీగార్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు నీరందించి వందశాతం మొక్కలు బతికేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎంపీడీఓ యాకూబ్ నాయక్, ఎంపీఓ సుమలత, సర్పంచులు కంచి జ్యోతి, వల్లూరి పద్మ, ఎంపీటీసీ మిర్యాల లక్ష్మమ్మ, పంచాయతీ కార్యదర్శులు మనోహర్రావు, నాగరాజు, లింగయ్య పాల్గొన్నారు. రావిగూడెంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేయించారు. నోడల్ అధికారి శశాంక, పంచాయతీ కార్యదర్శి సంగీత, గుర్రం వెంకటయ్య, బొల్లు రామలింగం, లక్ష్మయ్య, యాదయ్య, శ్రీను, బక్కయ్య, పారిజాత, రజిత పాల్గొన్నారు. పలివెల జడ్పీహెచ్ఎస్ ఆవరణలో విద్యార్థులతో కలిసి టీపీయూఎస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య మొక్కలు నాటారు. సర్పంచ్ గజ్జెల బాలరాజుగౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ పూల వెంకటేశ్, ఆనగంటి వెంకటేశ్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి :ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత
నాంపల్లి : మండలంలోని ఎస్డబ్ల్యూ లింగోటం గ్రామంలో డ్రైనేజీ పనులను ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత ప్రారంభించారు. నామనాయక్ తండాలో బోరు, పసునూర్ గ్రామంలో స్కూల్ ప్రహరీ నిర్మాణానికి ఎంపీపీ శంకుస్థాపన చేశారు. ఎంపీడీఓ శేషుకుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, సర్పంచులు మునగాల సుధాకర్రెడ్డి, రమావత్ సుగుణ, పాండు, దివ్య, కోఆప్షన్ సభ్యుడు అబ్బాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, శ్రీశైలం యాదవ్, శంకర్నాయక్ పాల్గొన్నారు.