వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత వాటర్ ఫాల్స్కు శుక్రవారం జలకళ వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ర్టంతో పాటు మండలంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గుట్టలపై నుంచి వచ్చిన వరద నీరు చేరి ప్రవాహం కొనసాగింది. కొన్ని నెలలుగా నీళ్లు లేక వెలవెలబోయిన జలపాతంలోకి వరద నీరు చేరడంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అటవీశాఖ అధికారులు జలపాత సందర్శనకు పర్యాటకులకు అనుమతి నిలిపివేశారు.