జమ్మికుంట: టీఆర్ఎస్ సర్కారుతోనే సంక్షేమం సాధ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా గురువారం ఆయన జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఇంటింటా తిరుగుతూ టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. వారి వెంట నాయకులు సురేందర్ రావు, సర్పంచ్ సుజాత, ఎంపీటీసీ భీమ్రావు, ఉపసర్పంచ్ రవీందర్రావు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, తదితరులున్నారు.