న్యూఢిల్లీ: అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా దేశంలో బంగారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతున్నది. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇద్దరు నిందితుల నుంచి రూ.7.36 కోట్ల యెల్లో పౌడర్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పౌడర్ బరువు 1052 గ్రాములు ఉన్నదని, అది హెరాయిన్ అయితే దాని విలువ రూ.7.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
నిందితులిద్దరూ ఆ యెల్లో పౌడర్ను చిన్నచిన్న క్యాప్సూల్స్లో నింపారని, అనంతరం క్యాప్సూల్స్ను కడుపులోకి మింగేశారని ఢిల్లీలో ఎయిర్పోర్టులోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో వారి కడుపులో ఏదో ఉన్నట్లు తేలడంతో పరిశీలించి క్యాప్యూల్స్ను గుర్తించామని చెప్పారు. దాంతో నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.