కుత్బుల్లాపూర్, జూన్ 30: ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం చింతల్ క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు రూ.29,48,500 విలువ గల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో మంది నిరుపేదలకు సీఎం అత్యవసర నిధి నుంచి లబ్ధి చేకూరుతుందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు సైతం సుఖసంతోషాలతో ఉండేలా సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్: బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు, ప్రజలు సిద్ధం కావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రతి యేటా నగరమంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అత్యధిక నిధులను వెచ్చించి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ వేడుకలు నిర్వహిస్తున్నదన్నారు. ఇందుకు ఆలయాల ముస్తాబుతో పాటు బోనాల నిర్వహణకు ప్రభుత్వం ఖర్చులు అందిస్తుందని, వీటిని పొందేందుకు ఆలయాల కమిటీ నిర్వాహకులు లెటర్ ఫ్యాడ్, బ్యాంక్ అకౌంట్ కాపీ, కమిటీ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్, ఆలయాలకు సంబంధించిన మూడు ఫొటోలు జూలై 10వ తేదీలోపు కుత్బుల్లాపూర్ చింతల్ క్యాంపు కార్యాలయంలో అందజేయాలని కోరారు.
జీడిమెట్ల, జూన్ 30: సుభాష్నగర్ డివిజన్ పరిధి సూరారం కాలనీ 60 గజాలలో నివాసముంటున్న బాల భర్తను కోల్పోయి కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు బాల ఇంటి పైకప్పు కూలీపోయింది. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బుధవారం స్వయంగా బాధితురాలి ఇంటి వద్దకు వచ్చి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్రెడ్డి, బొడ్డు వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.