డిచ్పల్లి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన రెండో వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ శాసనసభ్యుడిగా పేరున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఇటవలే టీఎస్ ఆర్టీసీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్లోని బస్ భవన్లో ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్ ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.