వికారాబాద్ (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు కార్పొరేట్, పెద్ద దవాఖానలకే పరిమిమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇకపై వికారాబాద్లోని దవాఖానలో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. వికారాబాద్ సివిల్ దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ సెంటర్ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చికిత్స కంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలోనే పేదలకు మేలు కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లోనే డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటుచేశారని చెప్పారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.