నల్లగొండ : టీఆర్ఎస్ అంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కొవిడ్ సంక్షోభంలో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
నకిరేకల్ నియోజకవర్గంలో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి జరిగిందని తెలిపారు. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద పడకల దవాఖాన మంజూరు అయిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే దవాఖాన మంజూరుకు చొరవ తీసుకున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నకిరేకల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి