చేర్యాల, మే 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిరాడంబరంగా జరిగింది. ఆలయంలోని గంగిరేగుచెట్టు ఆవరణలో కొవిడ్ నిబంధనలను అనుసరించి ఈవో బాలాజీ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ గీస భిక్షపతి మాట్లాడుతూ.. తొలిసారిగా చైర్మన్ పదవిని టీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్లకు కేటాయించడం హర్షణీయమని చెప్పారు. కొమురవెల్లి గ్రామానికి చెందినవారిని నియమించడం కూడా ఇదే తొలిసారని చెప్పారు. మల్లన్న క్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని, దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి అన్నివసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ కో ఆర్డినేటర్ గుజ్జ సంపత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన చైర్మన్తోపాటు ధర్మకర్తలను టీఆర్ఎస్ నాయకులు, ఘనంగా సన్మానించారు. సభ్యులుగా తుమ్మల రవి, ఉత్కూరి అమర్, ధరావత్ అనిత, తాళ్లపల్లి శ్రీనివాస్, కొంగరి గిరిధర్, చింతల పర్శరాములు, తివారీ అలియాస్ బొందిలి దినేష్కుమార్, బొంగు నాగిరెడ్డి, శెట్టె అయిలయ్య, ముత్యం నర్సింహులు, పొతుగంటి కొమురవెల్లి, గడ్డం మహేశ్యాదవ్ ప్రమాణం చేశారు.