హైదరాబాద్, జూలై 18 ( నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్ మొయిల్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కోకాపేట భూముల వేలంపై ఆయన విమర్శలు అర్థంలేనివని కొట్టిపారేశారు. ఆన్లైన్ వేలంలో పాల్గొని ఎకరానికి రూ.100 కోట్లకు టెండర్ వేస్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్లో ఆయన మీడియా తో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టినా రేవంత్రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని మండిపడ్డారు. కోకాపేట భూముల వేలం కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా జరిగింద ని గుర్తుచేశారు. ఆన్లైన్ వేలం విధానాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉన్న రియల్ బూమ్ ఢిల్లీ, ముంబై, బెంగళూ రు, కోల్కతా నగరాల్లో లేదని తెలిపారు. గతంలో సీఎం గా రాజశేఖర్రెడ్డి ఉన్నప్పుడు కోకాపేట భూములకు ఎకరం రూ.7 కోట్ల నుంచి రూ.14 కోట్లు కనీస ధర నిర్ణయించారని గుర్తుచేశారు. భూముల వేలంపై ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నదని, ఈ విషయంలో రేవంత్రెడ్డి దిక్కుమాలిన విమర్శలు మానుకోవాలని సూచించారు. రూ.5 కోట్లు డిపాజిట్ చేసి ఎవరై నా వేలంలో పాల్గొనే అవకాశం ఉన్నదని తెలిపారు. ఆన్లైన్లో ఒకరు వేసిన టెండర్ ధర మరొకరికి ఎట్టిపరిస్థితుల్లోనూ కనిపించదని స్పష్టంచేశారు.
ఇక్కడ భూములమ్మి ఆంధ్రాలో ఖర్చు
ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు హైదరాబాద్ భూములు అమ్మి ఆంధ్రలో ఖర్చు చేసినందువల్లనే ఆ నాడు భూముల అమ్మకాలను అడ్డుకున్నామని వెంకటేశ్వర్లు తెలిపారు. భూముల వేలంలో అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి అవినీతి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ను మించిన అవినీతిపరుడు ఎవరూ లేరని అన్నారు. రాజపుష్ప తెలంగాణ ఏర్పాటు కు ముందే లీడింగ్ రియల్ ఎస్టేట్ సంస్థ అని గుర్తుచేశా రు. రేవంత్ బ్లాక్ మొయిల్ పాలిటిక్స్ వదిలేస్తే కాంగ్రెస్ బాగుపడుతుందని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలిచే అవకాశమున్న కాంగ్రెస్, రేవంత్ వల్ల ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకోనున్నదని పేర్కొన్నారు.