జగిత్యాల : జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ క్యాంపులో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.
కుటుంబ కలహాల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ధరూర్ క్యాంపునకు చెందిన వక్రాల హనుమంతరావు (68), సులోచన (58) భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు.
దంపతులిద్దరూ కుమారులతో కాకుండా విడిగా ఉంటున్నారు. హనుమంతరావు అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లో మంచంపై మృతి చెందాడు.
భార్య సులోచన ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచార అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.