ఆ భూమిపై వారికి ఎలాంటి హక్కు లేదు.. కానీ.. వారికి అక్కడ అనేక అక్రమ నిర్మాణాలున్నాయి! ఆ భూమి నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తూ.. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్నారు! గోదాములు, భవనాలు, గెస్ట్హౌస్లు కుప్పలు తెప్పలుగా కట్టేశారు! పోనీ వాటికి అనుమతులున్నాయా? అంటే ఒక్కదానికీ లేదు! ఆఖరుకు.. మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ నిర్మాణాలకూ అనుమతుల్లేవు! దేవరయాంజాల్ దేవుడి మాన్యాల్లో అక్రమాలపై నిగ్గు తేల్చుతున్న ప్రత్యేక కమిటీ.. లోతుకు వెళ్లేకొద్దీ విస్తుబోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి! బినామీ.. బినామీ.. బినామీ.. ఏ స్థలం గుట్టు వెతికినా.. బినామీలే బయటకు వస్తున్నారు. వారంతా మాజీ మంత్రి ఈటల బినామీలేనని తెలుస్తున్నది!
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేవరయాంజాల్లోని దేవుడి భూముల్లో అక్రమాలపై ఐఏఎస్ అధికారుల బృందం నిగ్గుతేలుస్తున్నది. గడిచిన మూడు రోజులుగా దేవుడి మాన్యంలో ప్రతీ ఇంచు భూమి లెక్కలను తీస్తున్నారు. ఇక్కడ పేరుకే దేవుడి మాన్యం ఉన్నది. 1500 ఎకరాలు రికార్డుల్లో ఉంటే క్షేత్రస్థాయిలో పదో వంతు కూడా మిగల్లేదని తెలుస్తున్నది. ఈటలపై భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు నేతృత్వంలో నియమించిEtela rajendern structures are not permittedన ఐఏఎస్ అధికారుల బృందం తమకు అప్పగించిన పనిలో 60 శాతానికిపైగా ఇప్పటికే పూర్తిచేసింది. వీరి విచారణలో అనేక ఆశ్చర్యకర విషయాలు వెల్లడవుతున్నట్టు తెలిసింది. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న కొందరు.. ఎలాంటి హక్కు లేకపోయినా.. అక్కడి భూమి నుంచి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని బయటపడింది. మొత్తం 1500 ఎకరాలకుపైగా ఉన్న భూమిని 8 సర్వే బృందాలతో కొలవడం ప్రారంభించిన అధికారులు.. మొత్తం పనిని రెండు రకాలుగా విభజించుకున్నారు. తొలుత ఆ భూముల్లో నిర్మాణాలపై దృష్టిసారించి, వాటి లెక్కలు తేల్చారు. వీటిలో ఎక్కువగా గోదాములు ఉన్నాయి. వీటితోపాటు.. అనేక భవనాలు, గెస్ట్హౌజ్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ భవనాలు నిర్మించినవారి జాబితాను అధికారులు రూపొందించినట్టు తెలిసింది. ఈ భూముల్లో ఈటల రాజేందర్ లక్ష చదరపు అడుగులకుపైగా నిర్మాణాలను చేపట్టినట్టు గుర్తించారని సమాచారం. మిగిలిన నిర్మాణాలు కూడా ఈటల బినామీలవేనని భావిస్తున్నారు. బినామీలెవరన్నదీ తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని అనుమానాస్పద భూములను, నిర్మాణాలను అధికారుల బృందం గుర్తించినట్టు సమాచారం. అనుమానం వచ్చిన ప్రతి నిర్మాణాన్నీ ఫొటో తీయడంతోపాటు వాటికి సంబంధించిన ప్రతీ లెక్కను నమోదు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. వీటిలో ఏ ఒక్క నిర్మాణానికి కూడా అనుమతి లేదు. చివరకు.. రాష్ట్ర మంత్రిగా పనిచేసి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ చేపట్టిన నిర్మాణాలకు కూడా అనుమతులు లేకపోవడం గమనార్హం. నిర్మాణాలకు సంబంధించిన సర్వేను అధికారులు మంగళవారం పూర్తిచేశారు. బుధవారం ఖాళీ స్థలాలు, పొలాలపై విచారణ చేపట్టారు.
దేవరయాంజాల్ దేవస్థానం భూముల్లో ఆక్రమణల కథలన్నీ బినామీల పేర్లతోనే నడుస్తున్నాయని తెలుస్తున్నది. ఇక్కడ లభిస్తున్న సమాచారం ప్రకారం.. వీటికి ఈటల సూత్రధారిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఉన్న ప్రతి అంగుళం భూమినీ లెక్కిస్తున్న అధికారులు.. సర్వే నంబర్ వారీగా, ఆక్రమణల వారీగా పేర్లను నమోదు చేస్తున్నారు. అక్కడ పేర్లు చెప్తున్నవారి వివరాలను కూడా నోట్ చేసుకుంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నది. అనంతరం కొంత స్పష్టత వస్తుందని చెప్తున్నారు. సర్వే, భూ వివరాల నమోదు ప్రక్రియల్లో రెవన్యూ, పంచాయతీ, మున్సిపల్- హెచ్ఎండీఏ తదితర శాఖల అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఇక్కడి భూములు కొంత భాగం మున్సిపల్ శాఖ పరిధిలో ఉండడంతో వారిని కూడా భాగస్వాములను చేశారు. దాదాపు వందేండ్ల రికార్డులను తవ్వుతున్నారు. ఏ సంవత్సరంలో ఎవరున్నారన్నది తేల్చడంతోపాటు దేవరయాంజాల్లోని మొత్తం భూమికి సంబంధించి గత ప్రభుత్వాలు వేసిన వివిధ కమిటీల నివేదికను కూడా కమిటీకి నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు తెప్పించుకున్నారు. నివేదికలను, కోర్టు కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. కోర్టు తీర్పులు, కమిటీలు ఏవీ ఇక్కడ భూ మిని ఆక్రమించుకున్న ఈటల రాజేందర్, ఆయన కుటుంబసభ్యులకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదన్న విషయాన్ని నిర్థారించుకున్నారని తెలిసింది. తమ పలుకుబడిని ఉపయోగించుకొని భూములను కొల్లగొట్టినట్టు ప్రాథమిక నిర్థారణకు కమిటీ వచ్చినట్టు సమాచారం. అతిత్వరలోనే కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నది.