ఐసొలేషన్ కేంద్రంలో 36 గంటల్లో 12 మంది మృతి
చివరి క్షణంలో తీసుకురావడంతోనే..: డాక్టర్ అనిల్
మంచిర్యాల, మే 6, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్ మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిని బెంబేలెత్తిస్తున్నది. బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రంలో బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు 36 గంటల్లోనే 12 మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు తీసుకొచ్చిన మూడు గంటల్లోపే చనిపోయారని బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రం ఇంచార్జి డాక్టర్ అనిల్ తెలిపారు. బాధితులందరూ విషమ పరిస్థితుల్లో, చివరి క్షణాల్లో వస్తుండటంతో దవాఖానలో చేరిన గంటల్లోపే చనిపోతున్నారని పేర్కొన్నారు. ఐసొలేషన్ కేంద్రంలో బెడ్ల కొరత లేదని, ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉన్నాయని చెప్పారు. ఆందోళన అవసరంలేదని భరోసా ఇచ్చారు.