హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్రావు సోమవారం మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మలక్పేటలోని నివాసం ఆవరణలో మొక్కలునాటి సెల్ఫీ దిగారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా యజ్ఞంలా సాగుతున్న గ్రీన్ఇండియా చాలెంజ్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉన్నదన్నారు. ప్రతీవ్యక్తి తమ పుట్టినరోజున మూడు మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు.