డివిజన్లలో పక్కా కార్యాచరణ
పారిశుధ్య పనుల పర్యవేక్షణ
వరంగల్, మే, 25 : కరోనా కట్టడికి కార్పొరేటర్లు నడుం బిగించారు. ఇందులో భాగంగా డివిజన్లలో పారిశుధ్య పనులను విస్తృతం చేస్తున్నారు. ప్రతి రోజూ పర్యటిస్తూ సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా బాధితులకు అండగా ఉంటూ వారిలో మనో ధైర్యాన్ని నింపుతున్నారు.
కరోనా పరీక్షలపై దృష్టి..
కార్పొరేటర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి డివిజన్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. మరికొంత మంది కార్పొరేటర్లు స్థానిక యువతను సమీకరించి కరోనా బాధితులకు నిత్యావసర సరుకులతో పాటు మందులు అందిస్తున్నారు.
ముమ్మరంగా పారిశుధ్య పనులు..
డివిజన్లలో కరోనా ఉధృతి పెరుగకుండా కార్పొరేటర్లు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ కార్పొరేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకుం టూ సోడియం హైపొక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఇటీవల మేయర్ గుండు సుధారాణి కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పారిశుధ్య ప్రణాళిలు వివరించిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా డివిజన్లలో ద్రావణం స్ప్రే చేస్తున్నారు.
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన అన్నారు. మంగళవారం డివిజన్లోని సరస్వతి ఉన్నత పాఠశాలలో కరోనా నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 125 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు గందె నవీ న్, సీకేఎం దవాఖాన సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి
కాశీబుగ్గ : కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ సూచించారు. మంగళవారం డివిజన్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని అన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ధైర్యంతో కరోనా జయించవచ్చు..
హన్మకొండ చౌరస్తా : ధైర్యంతో కరోనాను జయించవచ్చని ఆరో డివిజన్ కార్పొరేటర్ చెన్నం మధు అన్నారు. డివిజన్లోని జాగృతి కాలనీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వైద్య సిబ్బంది, జాగృతికాలనీవాసులు సోమ మధు, కొండూరి వెంకట్రెడ్డి, సంపత్రెడ్డి, రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులున్నారు.
ఇంట్లోనే ఉండాలి..
కాజీపేట : లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు అన్నారు. కాజీపేట 47వ డివిజన్లోని బాపూజీనగర్, బుడిదగడ్డ తదితర ప్రాం తాల్లో సోడియం హైపొక్లోరైట్ ద్రావణాన్ని ఆయన పిచికారీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు మ ర్యాల కృష్ణ, మైలారం శంకర్, దార్ల రాజుకుమార్, రాం వెంకట్ రావు, యాదగిరి, శ్రీకాంత్, గ్రేటర్ సిబ్బంది పాల్గొన్నారు.
21వ డివిజన్లో పారిశుధ్య పనుల పరిశీలన
పోచమ్మమైదాన్ : గ్రేటర్ 21వ డివిజన్లో కార్పొరేటర్ పుర్ఖాన్ పారిశుధ్య పనులను మంగళవారం పరిశీలించారు. డివిజన్లోని పలు ప్రాంతాలు తిరుగుతూ శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలా గే, నిత్యం మురికికాల్వల పరిశుభ్రంతో పాటు రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలని తెలిపారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.